Saturday, January 25, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

ఘనంగా జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

ఎంఈఓ గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఎల్సికేపురంలో గల భవిత దివ్యాంగుల సెంటర్లో ఎంఈఓ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా ఎంఈఓ గోపాల్ నాయక్ పాల్గొని వికలాంగుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులను సైకాలజీని బట్టి చదువును అందించాల్సిన బాధ్యత అందరిమీద ఉందని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రతి వారము రెండు రోజులు ఫిజియోథెరపీ చేయించారని తెలిపారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు విధిగా విద్యార్థులకు ఫిజియోథెరపీ చేయించాలని, భవిత పాఠశాలలో విద్యను అభ్యసింపచేసేలా కృషి చేయాలని తెలిపారు. దివ్యాంగుల విద్యార్థులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తోందని, వాటిని తల్లిదండ్రులు తమ పిల్లలకు సద్వినియోగం కలిగేలా ఉపయోగించుకోవాలని తెలిపారు. దివ్యాంగ విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తదుపరి పదవ తరగతి ఉత్తీర్ణులైనటువంటి ఇద్దరు విద్యార్థులను ఎంఈఓ తో పాటు భవిత పాఠశాల టీచర్లు సరస్వతి, మల్లికార్జున,హెచ్ఎం నాగప్ప కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భవిత పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు