-సర్పంచ్ సాకే తిరుపాలు
విశాలాంధ్ర-అనంతపురం : గ్రంథాలయాలలో విద్యార్థులు, పాఠకులు పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని రాప్తాడు సర్పంచ్ సాకే తిరుపాలు అన్నారు. రాప్తాడు గ్రంథాలయాలయ అధికారి వీరనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణా తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈసందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. వీరనారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. సర్పంచ్ సాకే తిరుపాలు మాట్లాడుతూ… చినిగిన చొక్కా అయినా తొడుక్కో – ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఒక మంచి మాట తో పుస్తకం విలువను పుస్తకం ఆవశ్యకతను గురించి వివరించారు. పుస్తకము ఒక మంచి నేస్తం అని పుస్తకాలను చదివే అలవాటు చిన్నప్పటినుంచే అలవర్చుకోవాలన్నారు. నేటి చరిత్ర భావితరాలకు అందించే ఒక అద్భుతమైన రూపమే పుస్తకమన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగి ఆదినారాయణరెడ్డి, విద్యార్థినీ, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
గ్రంథాలయాలలో విద్యార్థులు, పాఠకులు పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని రాప్తాడు సర్పంచ్ సాకే తిరుపాలు అన్నారు. రాప్తాడు గ్రంథాలయాలయ అధికారి వీరనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణా తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈసందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. వీరనారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. సర్పంచ్ సాకే తిరుపాలు మాట్లాడుతూ… చినిగిన చొక్కా అయినా తొడుక్కో – ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఒక మంచి మాట తో పుస్తకం విలువను పుస్తకం ఆవశ్యకతను గురించి వివరించారు. పుస్తకము ఒక మంచి నేస్తం అని పుస్తకాలను చదివే అలవాటు చిన్నప్పటినుంచే అలవర్చుకోవాలన్నారు. నేటి చరిత్ర భావితరాలకు అందించే ఒక అద్భుతమైన రూపమే పుస్తకమన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగి ఆదినారాయణరెడ్డి, విద్యార్థినీ, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.