Tuesday, June 10, 2025
Homeఆంధ్రప్రదేశ్గుంటూరు జీజీహెచ్‌కు కొమ్మినేని శ్రీనివాస‌రావు

గుంటూరు జీజీహెచ్‌కు కొమ్మినేని శ్రీనివాస‌రావు

వైద్య ప‌రీక్ష‌ల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లిన పోలీసులు
కొమ్మినేనితో పాటు కృష్ణంరాజు, సాక్షి టీవీ యాజమాన్యంపైనా ఎఫ్ఐఆర్

అమ‌రావతి మ‌హిళ‌ల‌పై అస‌భ్య వ్యాఖ్య‌లు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్ట్, సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఈరోజు ఉద‌యం వైద్య ప‌రీక్ష‌ల కోసం ఆయ‌న‌ను గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం ఆయ‌న‌ను మంగ‌ళ‌గిరి కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్నారు. ఓ చర్చా కార్యక్రమంలో అమరావతి ప్రాంత మహిళలపై ఆయన చేసినట్లుగా ఆరోపించబడుతున్న వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి, నాలుగు రోజుల క్రితం దాఖలైన ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ జరిగింది. హైదరాబాద్‌లోని జర్నలిస్ట్స్ కాలనీలో ఉన్న ఆయన నివాసం నుంచి కొమ్మినేని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న అధికారులు, తదుపరి చట్టపరమైన చ‌ర్య‌ల నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు.

అమరావతిని వేశ్యల రాజధానిఁ అంటూ జ‌ర్న‌లిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కేఎస్ఆర్ లైవ్ షోలో ఆయ‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఈ వ్యాఖ్య‌లను యాంక‌ర్ కొమ్మినేని శ్రీనివాస‌రావు ఖండించ‌క‌పోగా వాటిని కొన‌సాగించేందుకు మ‌రింత ఊత‌మిచ్చారు. ముఖ్యంగా రాజధాని అభివృద్ధి కోసం తమ భూములను త్యాగం చేసిన మహిళలను ఈ వ్యాఖ్యలు తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని పలువురు ఖండించారు.

ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు జ‌ర్న‌లిస్టు కృష్ణంరాజు, ఃసాక్షి టీవీః యాజమాన్యంపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంతో పాటు, భారతీయ న్యాయ‌సంహిత‌లోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. కాగా, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఘటన మీడియా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు