ధర్మవరం పట్టు చీరల తయారీ వ్యాపారస్తుల సంఘం
విశాలాంధ్ర ధర్మవరం;; తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో గల నల్లి సిల్క్ హౌస్ ప్రముఖ వ్యాపారి కుప్పు స్వామి శెట్టి యార్ ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని పట్టు చీరల తయారీ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజ రవి, కార్యదర్శి నీలూరి శ్రీనివాసులు, సహాయ కార్యదర్శులు హేమంత్ కుమార్, నవీన్ లు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గిర్రాజు రవి మాట్లాడుతూ 85 సంవత్సరాల వయసు గల కుప్పు స్వామి శెట్టి యార్ తనదైన శైలిలో బట్టల వ్యాపారం చేసుకుంటూ మంచి గుర్తింపు పొందడం జరిగిందన్నారు. మంచి సౌమ్యుడు, ఓపిక గలవారు, అజాతశత్రువు గా ఉండే వీరికి కేంద్రం గుర్తించి పద్మభూషణ అవార్డు ఇవ్వడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు. అంతేకాకుండా చెన్నైలో నల్లి సిల్క్స్ ను 1928 నుండి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. తదుపరి వారికి సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జూన్ మొదటి వారంలో చెన్నైలో నిర్వహించబడే సన్మాన సభకు సంఘం తరఫున వెళుతున్నామని, అక్కడ కుప్పు స్వామి శెట్టి యార్ ను ధర్మవరం తరపున ఘనంగా సత్కరించడం జరుగుతుందని తెలిపారు.
కుప్పు స్వామి శెట్టి ఆర్ కు పద్మభూషణ అవార్డు పట్ల హర్షం
RELATED ARTICLES