విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పెద్దకడబూరు మండలంలో ఈనెల 26న సిపిఐ ఆధ్వర్యంలో జరిగే సిపిఐ 8వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి చంద్రమ్మ భవనం వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సహాయ కార్యదర్శి మునెప్ప, జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ పాల్గొంటారని తెలిపారు. ఈ మహాసభల్లో మండల పరిధిలోని కల్లుకుంట గ్రామ ప్రభుత్వ భూమి పోరాటం, మండల వ్యాప్తంగా ఉన్న రైతు సమస్యల పరిష్కార సాధన, ఆర్డీఎస్ కుడి కాలువ పనులు పూర్తి చేయాలని, పెద్దకడబూరు నుంచి ఆదోని వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని, కల్లుకుంట గ్రామంలో ఉన్న బస్టాండ్ ఆవరణంలో మట్టి రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మించాలని తదితర సమస్యలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాలుగు మండలాల కార్యదర్శులు పాల్గొంటారన్నారు. కావున ఈ మహాసభలకు అధిక సంఖ్యలో సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబు, అంజి, లక్ష్మన్న, మునిస్వామి, హనుమంతు, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.