Wednesday, June 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయియోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.. ఆర్డీవో మహేష్

యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.. ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర ధర్మవరం;; జూన్ 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ధర్మవరం డివిజన్ పరిధిలో గల అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో “యోగాంధ్ర – 2025” కార్యక్రమం గురించి సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మహేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న “యోగాంధ్ర – 2025” కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ధర్మవరం డివిజన్ పరిథిలో గల అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. అలాగే జూన్ 21వ తేదిన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, జూన్ 10వ తేదీన ధర్మవరంలో నిర్వహించు “యోగాంధ్ర – 2025” నందు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింటు కలెక్టరు, పాల్గోనుదురని తెలిపారు.ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, నిర్వహణ గురించి పలు శాఖలకు సంబంధించిన అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరిగిందన్నారు. అలాగే యోగా అనేది మన జీవితంలో ప్రతి రోజూ ఒక భాగంగా చేసుకుంటే అందరూ ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడుతుందని తెలిపారు. అందరూ వారి కుటుంబ సభ్యులతో కలిసి యోగా ప్రతి రోజు సాధన చేయాలని తెలిపారు. ఈ సమావేశమునకు గౌరవ ధర్మవరం డి.ఎస్.పి హేమంత్ కుమార్ , డి ఎల్ పి శివకుమారి , మునిసిపల్ మేనేజర్, ధర్మవరం డివిజన్ లోని ఎంపీడీవోలు, ఎం ఈ ఓ లు, సిడిపిఓ లు, డ్వామా, డిఆర్డిఏ తదితర శాఖలకు సంబధించిన అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు