విశాలాంధ్ర ధర్మవరం; ప్రగతి శీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గా పనిచేస్తున్న మంజుల నరేంద్ర జాతీయ కార్యదర్శివర్గంలో జాతీయ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కేరళ రాష్ట్ర రాజధాని త్రివేండ్రంలో ప్రగతిశీల విద్యార్థి సంఘం నాలుగో జాతీయ మహాసభలో వీరిని ఎన్నుకోవడం జరిగింది. జాతీయ కార్యదర్శివర్గం కమిటీలో ఎనిమిది మంది సభ్యులలో నాకు అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షులు మహమ్మద్ షఫిఉల్లా,కార్యదర్శి బలరాం సంజీవ్కు ధన్యవాదములు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్నా విద్యారంగా సమస్యలు అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం రాజిలేని పోరాటం చేస్తానని తెలిపారు.
పి ఎస్ యు జాతీయ కమిటీ సభ్యుడిగా మంజుల నరేంద్ర ఎన్నిక
RELATED ARTICLES