Wednesday, June 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయితల్లి వందనం కార్యక్రమం పై సమావేశం..

తల్లి వందనం కార్యక్రమం పై సమావేశం..

ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో తల్లి వందనం కార్యక్రమం పై సమావేశాన్ని ఎంపీడీవో సాయి మనోహర్, ఎంఈఓ గోపాల్ నాయక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లివందనం అనే కార్యక్రమంలో ప్రతి లబ్ధిదారులు నష్టపోకుండా చూడాలని వారు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ తల్లి వందన కార్యక్రమం అందరికీ లబ్ధి చేకూరేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. రేషన్ కార్డు, జీఎస్టీ, టాక్స్ నాలుగు చక్రాల వంటి సమస్యలు ఉన్న యెడల సచివాలయం నందు గ్రామ కార్యదర్శి వెల్ఫేర్ సహాయకులు డిజిటల్ సహాయకులు సంప్రదించాలని తెలిపారు. అలా కాళీ ఎడల పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమస్యను పరిష్కరించుకొని అవకాశం కూడా కలదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు