Thursday, June 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె నోటీసులు మున్సిపల్ కమిషనర్ కు సమర్పణ

మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె నోటీసులు మున్సిపల్ కమిషనర్ కు సమర్పణ

విశాలాంధ్ర ధర్మవరం : సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉదయం మస్టర్ పాయింట్ వద్ద మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ వద్ద నిరసన తెలియజేసి కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగినది .ఈ సందర్భంగా మండల కన్వీనర్ జె.వి. రమణ ,ఎస్. హైదర్ వలీ ఇంజనీరింగ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొగ్గు నాగరాజు, పారిశుద్ధ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు ఎం. బాబు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అనేక పర్యాయాలు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ,ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ,స్కిల్, సెమిస్కిల్డ్ కార్మికులకు వేతనాలు జీవో ప్రకారం ఇవ్వాలని తెలిపారు.ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి, కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా కుటుంబాల జీవన విధానాలను మెరుగుపరచుకోవడానికి కనీస వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ అలవెన్స్ వర్తింపచేయాలని, సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని తదితర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రకాల ఆందోళనలతో కూడిన వినతి పత్రాలు ఇవ్వడం జరిగినదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించనందున రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె నిర్వహించబోతున్నామని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా చనిపోయిన కార్మిక కుటుంబాలకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనితెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కార్మిక సంఘం నాయకులు బాబు, అనిల్, యోగి, కాటమయ్య ,దస్తగిరి, పారిశుధ్య కార్మిక సంఘం నాయకులు ఓబులేసు, చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు