విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు:ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం నోటి క్యాన్సర్ బారిన పడే దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉండటం ఆందోళన కలిగిస్తుందని, ఏడాదికి 52వేల మంది భారత్ లో నోటి క్యాన్సర్ మూలంగా మరణిస్తున్నారని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ వెల్లడించారు. దేశంలో క్యాన్సర్ నిర్మూలనకు అపోలో సంస్థ తన వంతు సామాజిక సేవగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈనెల 31వ తేదీనా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం డాక్టర్ శ్రీరామ్ సతీష్ నెల్లూరు అపోలో హాస్పిటల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈఎన్ టి వైద్య నిపుణులు డాక్టర్ సతీష్, డాక్టర్ నాగేంద్ర, సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జి.వి.వి. ప్రసాద్, సీనియర్ అంకాలజిస్ట్ డాక్టర్ హరితతో కలిసి మీడియాతో మాట్లాడారు.క్యాన్సర్ నిర్మూలనలో భాగంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 31వ తేదీ నుండి దేశంలోని అన్నీ అపోలో హాస్పిటల్స్,అపోలో క్యాన్సర్ సెంటర్లలో నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రారం
భిస్తున్నామని చెప్పారు.అందులో భాగంగా
నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో కూడా స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ముందుగానే గుర్తిస్తే నోటి క్యాన్సర్ ను పూర్తిగా నిర్మూలించవచ్చునని, 30 ఏళ్లు పైబడి, పొగాకు అలవాటు ఉన్న వారు ఖచ్చితంగా నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. తరచూ నాలుక, నోటిలో పుండ్లు, ఎరుపు లేదా తెలుపు మచ్చలు రావడం నోటి క్యాన్సర్ లక్షణాలుగా గుర్తించాలన్నారు. పొగాకు వ్యసనానికి బానిసలుగా మారిన వ్యక్తులను గుర్తించి వారిని ఆ అలవాటుకు దూరంగా మార్చేందుకు అపోలో సంస్థ,ఈషా ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తుందని డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ సతీష్, డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ జి.వి.వి. ప్రసాద్, డాక్టర్ హరిత వెల్లడించారు.ఈ సమావేశంలో అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.