విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వంకదారి మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం యువర్స్ ఫౌండేషన్, జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. శిబిరదాతగా షేక్ సికిందర్ను నిర్వహించగా, తదుపరి వారిని ఘనంగా సత్కరించారు. ఈ శిబిరంలో 98 మంది కంటి రోగులు పాల్గొనగా అందులో 52 మందిని కంటి ఆపరేషన్లకు ఎంపిక చేసి బెంగళూరుకు పంపించడం జరిగిందన్నారు. ఉచిత ప్రయాణం, ఉచిత వసతి, ఉచితంగా కంటి అద్దాలను కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కంటి డాక్టర్ నవ్య రోగులందరికీ కంటి పరీక్షలను నిర్వహించి కంటి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగిందన్నారు. నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి వారు యువర్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు. కంటి శుక్లమ్ములు ఉన్న వారిని పరీక్షించి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఉచితంగా లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. బిపి, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారు వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి కంటి ఆపరేషన్లను నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాకుండా నేత్ర దానం కూడా ప్రతి ఒక్కరు చేయాలని, మీ మీ ప్రదేశాలలో ఎవరైనా మృతి చెందినచో వివరాలు తెలిపి నేత్ర ధానముకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. శిబిరానికి వచ్చిన రోగులందరికీ కూడా భోజన వసతి కూడా కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు , స్టార్ ఖలీల్ ,పోలా ప్రభాకర్, వై కే. శ్రీనివాసులు,చాంద్ భాష,, కౌన్సిలర్ కేతా లోకేష్ ,బండ్లపల్లి రంగనాథం, గర్రె రమేష్ బాబు, రాధాకృష్ణ, సత్రశాల మల్లికార్జున, నామాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. యువర్స్ ఫౌండేషన్
RELATED ARTICLES