భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. శత్రువు దాడుల వల్ల భారీ నష్టాలు వాటిల్లాయని, స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయని పేర్కొంటూ, మరిన్ని రుణాలు అందించాలని పాకిస్థాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ భాగస్వాములను అభ్యర్థించింది. ఉద్రిక్తతలు తగ్గించడానికి సహాయం చేయాలని కూడా కోరింది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం, ఎక్స్ వేదికగా ఈ విజ్ఞప్తిని చేసింది. శత్రువు వల్ల కలిగిన భారీ నష్టాల నేపథ్యంలో మరిన్ని రుణాల కోసం అంతర్జాతీయ భాగస్వాములకు పాకిస్థాన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. పెరుగుతున్న యుద్ధ వాతావరణం, స్టాక్ మార్కెట్ పతనం మధ్య, ఉద్రిక్తతలు తగ్గించడానికి అంతర్జాతీయ భాగస్వాములు సహాయం చేయాలని మేము కోరుతున్నాంఁ అని ఆ పోస్ట్లో పేర్కొంది.
ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్.. అంతర్జాతీయ సాయం కోసం విజ్ఞప్తి
RELATED ARTICLES