ఆలయ ప్రధాన అర్చకులు కైప ద్వారకనాథ్ శర్మ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీ కాశీ విశాలాక్షి సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో ఉయ్యాల ఉత్సవం పల్లకి సేవను భక్తాదులు, దాతలు, ప్రజల నడుమ అత్యంత వైభవంగా ఆలయ ప్రధాన అర్చకులు కైపారాధన శర్మ నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం శివ భక్తాదులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. పల్లకి సేవ ఉత్సవానికి ఉభయ సేవాకర్తలుగా బుగ్గ ప్రతాప్ ,ధర్మపత్ని లావణ్య వారి కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం వీరి పేరుటన ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చన నిర్వహించామని తెలిపారు. ఈ ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడానికి దేవాలయ శివ భక్తాదులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తాదులు పాల్గొన్నారు.
కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో పల్లకి సేవ..
RELATED ARTICLES