అమెరికాలోని లాస్ ఏంజెలెస్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక నిరసనలు, దహనాలు, లూటీల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు మేయర్ కారెన్ బాస్ ప్రకటించారు. ఈ పరిణామం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లాస్ ఏంజెలెస్ డౌన్టౌన్లోని కొన్ని ప్రాంతాల్లో నిన్నటి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమల్లోకి వచ్చిందని మేయర్ కారెన్ బాస్ తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, అవసరాన్ని బట్టి కొన్ని రోజుల పాటు కొనసాగవచ్చని ఆమె వివరించారు. అయితే, కర్ఫ్యూ ప్రాంతాల్లో నివసించే వారికి, అక్కడ పనిచేసే ఉద్యోగులకు దీని నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. గతవారం లాస్ ఏంజెలెస్లో రోజువారీ కూలీలు, కార్మికులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. హోం డిపో పార్కింగ్ స్థలంలో, ఒక వస్త్ర తయారీ కంపెనీలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారులు 40 మందికి పైగా వలసదారులను అదుపులోకి తీసుకోవడంతో శుక్రవారం నుంచి ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఈ దాడులే ప్రస్తుత అశాంతికి మూలకారణమని మేయర్ బాస్ పేర్కొన్నారు.
నగరంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందని, దీనిని అదుపులోకి తీసుకురావడానికి లాస్ ఏంజెలెస్ పోలీస్ విభాగానికి అదనపు సహాయం అవసరమని మేయర్ కారెన్ బాస్ అంగీకరించారు. అయితే, ఆ సహాయం ట్రంప్ ప్రభుత్వం నుంచి కాదని ఆమె తేల్చిచెప్పారు. ఁశాంతిభద్రతల సమస్యకు నిజమైన పరిష్కారం ట్రంప్ ప్రభుత్వం ఃదాడులు ఆపడమేఃఁ అని ఆమె అన్నారు.
మరోవైపు, 4,000 మందికి పైగా నేషనల్ గార్డ్ దళాలను, 700 మంది మెరైన్లను లాస్ ఏంజెలెస్కు పంపుతున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంపై మేయర్ బాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ అధికారాలను ట్రంప్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. ఁమెరైన్లు ఇక్కడికి వచ్చాక ఏం చేస్తారని ప్రజలు నన్ను అడుగుతున్నారు. అది మంచి ప్రశ్నే, నాకూ ఎలాంటి సమాచారం లేదుఁ అని పాక్షిక కర్ఫ్యూ ప్రకటన సందర్భంగా విలేకరులతో అన్నారు.
ఈ నిరసనలను ఁశాంతికి, ప్రజాభద్రతకు ముప్పుఁగా అభివర్ణించిన ట్రంప్ ఆందోళనకారులను అణచివేయడానికి సైన్యాన్ని మోహరించాల్సి వస్తే అరుదుగా ఉపయోగించే వివాదాస్పద ఁఇన్సరెక్షన్ యాక్ట్ఁను ప్రయోగిస్తానని మంగళవారం హెచ్చరించారు. ఁలాస్ ఏంజెలెస్ను విముక్తి చేయడంఁ తన లక్ష్యమని అన్నారు. ఁకాలిఫోర్నియాలో మీరు చూస్తున్నది శాంతి, ప్రజాభద్రత, జాతీయ సార్వభౌమాధికారంపై విదేశీ జెండాలు మోస్తున్న అల్లరిమూకలు చేస్తున్న పూర్తిస్థాయి దాడిఁ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాలో నేషనల్ గార్డ్ దళాలు రాష్ట్ర, సమాఖ్య ప్రభుత్వాల ఉమ్మడి పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో, గవర్నర్ అనుమతి లేకుండా, ఆయన అధికారాలను అధిగమించి నేషనల్ గార్డ్ దళాలను మోహరించినందుకు అధ్యక్షుడు ట్రంప్పై దావా వేయడానికి కాలిఫోర్నియా సిద్ధమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణకు కాలిఫోర్నియా స్థానిక బలగాలు సరిపోతాయని గవర్నర్ న్యూసమ్ నొక్కిచెప్పినప్పటికీ, ఏదైనా రాష్ట్రంలో దండయాత్ర జరిగినా లేదా అలాంటి భయం ఉన్నా ఁఅధ్యక్షుడు సాధారణ దళాలతో అమెరికా చట్టాలను అమలు చేయలేని పక్షంలోఁ నేషనల్ గార్డ్ దళాలను మోహరించడానికి వీలు కల్పించే ఫెడరల్ చట్టంలోని మూడు నిర్దిష్ట నిబంధనలను ట్రంప్ ఉటంకించారు.
కాలిఫోర్నియాకు నియంత్రణ తిరిగి ఇవ్వండిఁ అని ట్రంప్ను కోరుతూ గవర్నర్ న్యూసమ్ ఆదివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ట్రంప్ జోక్యం చేసుకునే వరకు మాకు సమస్య లేదు. ఇది రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే. ఉద్రిక్తతలను రెచ్చగొడుతూ, నిజంగా అవసరమైన చోట నుంచి వనరులను మళ్లిస్తున్నారుఁ అని ఆయన పేర్కొన్నారు.