Tuesday, May 13, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికంటి క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

కంటి క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ నరసింహులు
విశాలాంధ్ర-ధర్మవరం ; కంటి క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మధు కంటి వైద్యశాలలో ప్రపంచ కంటి క్యాన్సర్ అవగాహన వారోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ ప్రపంచ కంటి క్యాన్సర్ అవగాహన వారోత్సవాలు మే 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. సాధారణంగా పుట్టిన బిడ్డనుండి రెండేళ్ల వయసు లోపల ఈ క్యాన్సర్ వ్యాధి వస్తుందని తెలిపారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించాలని తెలిపారు. తల్లిదండ్రుల నుండి వచ్చే జీన్స్ మార్పుల వలన ఈ క్యాన్సర్ వస్తుంది అని తెలిపారు. ఈ వ్యాధి కంటి యొక్క నల్ల గుడ్డులోని కంటిపాపలో తెల్లటి చుక్కగా కనిపిస్తుందని తర్వాత కంటిలోని మిగతా భాగాలకు వ్యాపించును అని తెలిపారు. కాబట్టి తల్లులు పిల్లల పట్ల ప్రతి విషయంలోనూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ క్యాన్సర్ ను మందుల ద్వారా, లేజర్ చికిత్స ద్వారా, రేడియేషన్ చికిత్స ద్వారా నయం చేసే అవకాశం ఉందని తెలిపారు. భయంకరమైన ఈ క్యాన్సర్ వ్యాధి స్వభావికంగా దానికదే కరిగిపోయే అవకాశం ఉందని, కాకపోతే ఆ అవకాశం కోసం ఎదురు చూడటం ఏమాత్రం సమంజసం కాదు అని తెలిపారు. అందుకే పెద్దలు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని తెలపడం జరిగిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు