Monday, June 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅసాంఘిక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలి..

అసాంఘిక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలి..

చట్ట పరిధిలో ప్రజలందరూ జీవించాలి.. రూరల్ ఎస్సై శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం:: అసాంఘిక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని చట్ట పరిధిలోని గ్రామ ప్రజలందరూ తప్పక జీవించాలని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని బృందావనం కాలనీలో గ్రామ సభను వారు ఏర్పాటు చేశారు. అనంతరం రూరల్ ఎస్సై మాట్లాడుతూ గ్రామాలలో ఏవైనా సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని, విచారణ జరిపి న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ఫ్యాక్షన్కు దూరంగా ఉండాలని, పేకాటకు దూరంగా ఉండాలని మధ్యానికి బానిస కాకూడదని తెలిపారు. తదుపరి సైబర్ క్రైమ్ పైన కూడా అవగాహన కల్పించడం జరిగిందని వారు తెలిపారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సత్కరిస్తే స్టేషన్కు సమాచారం అందించాలని, మైనారిటీ బాలలకు టూవీలర్లు ఇవ్వరాదని తెలిపారు. అంతేకాకుండా వాహనాలను నడిపేటప్పుడు తనిఖీ సమయంలో పోలీసులకు సహకరించాలని తెలిపారు. వాహనాలను నడిపేటప్పుడు వాటికి సంబంధించిన లైసెన్సు, తదితర రికార్డులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. టూవీలర్ నడిపేవారు హెల్మెట్ ధరించాలని, ఫోర్ వీలర్ నడిపేవారు సీటు బెల్టు వేసుకోవాలని తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు తనకు ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడే అవకాశం ఉంటుందని వారు తెలిపారు. మైనారిటీ బాలికలకు వివాహాలు జరపరాదని, అలా జరిపితే తల్లిదండ్రులతో పాటు అందరూ కూడా శిక్ష అర్హులు అవుతారని తెలిపారు. బాలికలను బాలుడు తో పాటు చక్కగా చదివించాలని తేడాలు ఉండరాదు అని తెలిపారు. ప్రభుత్వం కూడా బాల బాలికలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, ఆ పథకాల ద్వారా తమ పిల్లలను ఉన్నత విద్య వరకు చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని వారు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు