Wednesday, June 11, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయియోగ తోనే ఆరోగ్యం ..

యోగ తోనే ఆరోగ్యం ..

ఆర్డీవో మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; యోగ తోనే శరీర దృఢత్వంతో పాటు చక్కటి ఆరోగ్యం జీవితాంతం లభిస్తుందని ఆర్డీవో మహేష్ మున్సిపల్ కమిషనర్, ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మే నెల 25 నుంచి జూన్ నెల 21 వరకు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన యోగా తరగతులను నిర్వహించడం జరుగుతోంది అని, ఇందులో భాగంగానే ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, యువతి యువకులకు, వృద్ధులకు, అన్ని వయస్సుల వారికి యోగా పై శిక్షణ అవగాహన ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో యోగా అవగాహన శిక్షణా తరగతులకు ప్రజల నుండి విశేష స్పందన రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇకనుంచి యోగా అనేది కుటుంబంలోని దినచర్యల భాగంలో ఒక భాగముగా సభ్యులందరూ ఉండాలని తెలిపారు. భవిష్యత్తులో కూడా యోగా మరవకుండా యోగా అనునిత్యం చేసుకోవాలని తెలిపారు. ఈనెల 11వ తేదీన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టర్ చేతన్, జాయింట్ కలెక్టర్, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్, ఎస్పీ రత్న, తదితర ఉన్నతాధికారులు ధర్మవరంలో జరిగే యోగ దినోత్సవ అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. కావున పట్టణంలోని ప్రజలందరూ కూడా యోగాలో భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు. 11వ తేదీన నిర్వహించే యోగా దినోత్సవ అవగాహన సదస్సును పెద్ద ఎత్తున అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు తెలిపారు. అనంతరం పట్టణములోని పలుకూడినిలో ర్యాలీలను నిర్వహించి, ర్యాలీ యొక్క ఉపయోగాలను వారు ప్రజలకు వివరించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ పిఆర్ఓ పెనుబోలు విజయభాస్కర్, జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు సోమేశ్వర్ రెడ్డి, యోగా మాస్టర్స్ నరసింహులు నారాయణరెడ్డి భాస్కర్ రెడ్డి ఈశ్వరయ్య కట్టా రవితోపాటు సత్రశాల ప్రసన్నకుమార్, యోగా శిక్షకులు, అభ్యాసకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు