నల్గొండకు జిల్లాకు చెందిన ప్రణయ్ హత్య కేసులో ఎ 2 నిందితుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది.. ఈ హత్య కు సహకరించిన మిగిలిన నిందితులకు జీవిత ఖైదు ఖరారు చేస్తూ నేడు నల్గొండ కోర్టు తీర్పు వెలువరించింది. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు వెల్లడించింది. ఏ 2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయ స్థానం విధించింది. 302, 120 ఐపీసీ, 109, 1989 సెక్షన్ ఐపీసీ ఇండియన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించింది. శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని నేరస్థులు వేడుకున్నారు. అయితే వారికి కోర్టులో ఊరట లభించలేదు.
ప్రణయ్ హత్య కేసులో నిందితుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష
RELATED ARTICLES