Tuesday, June 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాన్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రైవేట్ పాఠశాల సంఘం

జాన్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రైవేట్ పాఠశాల సంఘం

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శాంతినగర్ లో గల సెయింట్ మేరీస్ ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ జాన్ రెడ్డి శనివారం కారు ప్రమాదంలో అనుకోకుండా మృతి చెందారు. ఈ మృతి పట్ల ప్రైవేట్ పాఠశాలల సంఘం గౌరవాధ్యక్షులు చాంద్ బాషా, అధ్యక్షుడు ఆంజనేయులు, కార్యదర్శి నరేంద్ర తోపాటు పట్టణ ప్రైవేట్ పాఠశాల కరెస్పాండెంట్లు సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జాన్ రెడ్డి కారు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రైవేట్ పాఠశాల సంఘాన్ని ఏర్పాటు చేయడంలో వారు కీలకపాత్ర పోషించడం జరిగిందన్నారు. అంతేకాకుండా వీరి ఆధ్వర్యంలో ప్రైవేట్ అసోసియేషన్ సంఘం అభివృద్ధి కూడా జరిగిందని తెలిపారు. జాన్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రైవేట్ పాఠశాలల వారు ప్రత్యేకంగా ప్రార్థించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు