ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున
విశాలాంధ్ర -అనంతపురం : మద్దతు ధరలు భారీగా పెంచామనడం హాస్యా స్పదం గా ఉందని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరం 26 ఖరీఫ్ సీజన్ కు ప్రకటించిన మద్దతు ధరలు స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా లేవని వారికి క్వింటాకు 69 రూపాయలు పెంచి భారీగా పెంచామని ప్రకటించుకోవడం సరికదాన్నారు.
కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన ప్రకారం వరి ధాన్యం క్వింటాకు 2369కి చేరుతుందని స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా క్వింటాకు వరి ధాన్యం మద్దతు ధర కనీసం మూడు వేల రూపాయలకు పైగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటల ఉత్పత్తులకు మద్దతు ధరలు సీ2 + 50% ప్రకారం నిర్ణయించబడడం లేదన్నారు. పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందన్నారు
2010_11 నుండి పంటలకు భారీగా మద్దతు ధరలు పెంచినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటుఅన్నారు. మద్దతు ధరలు లభించక నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో 1.20 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ప్రతిరోజు కనీసం 31 మంది రైతులు ఆత్మహత్యలకు గురవుతున్నారు అని పేర్కొన్నారు. నూటికి 58 శాతం మంది రైతులు అప్పుల ఊబిలోకి నెట్టబడ్డారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన మద్దతు ధరల జాబితాపై పునరాలోచన చేయాలని వరి ధాన్యానికి క్వింటాకు 3,000 వేలకు పైగా తగ్గకుండా మద్దతు ధర నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చూస్తోందన్నారు. అదేవిధంగా యం యస్. పి. కి. చట్టబద్ధత కల్పించాలని అప్పుల ఊబిలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ఒక్క పర్యాయం రుణమాఫీ ప్రకటించాలని జులై 9న గ్రామీణ బంధు నిర్వహించినట్లు వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల పెంపుకు ఒత్తిడి తేవాలని వరి ధాన్యానికి కింటాకు రూ. 500 బోనస్ ప్రకటించి రైతంగానే ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు