Tuesday, June 24, 2025
Homeజిల్లాలుకర్నూలు26 నుంచే వృద్దులకు, వికలాంగులకు రేషన్ పంపిణీ

26 నుంచే వృద్దులకు, వికలాంగులకు రేషన్ పంపిణీ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ప్రతి నెల 26 నుంచి 30 తేదీ వరకు 65 సంవత్సరాల పైబడిన వృద్దులకు, వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని తహసీల్దార్ గీతా ప్రియదర్శిని డీలర్లను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు డీలర్లకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గతంలో 1 తేదీ నుంచి 5 తేదీ వరకు వృద్దులకు, వికలాంగులకు రేషన్ పంపిణీ చెయ్యడం జరిగిందని తెలిపారు. ఈ నెల నుంచి ప్రభుత్వం 26 నుంచే పంపిణీ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. మండలంలో ఈకేవైసీ 4 వేల మంది పెండింగ్లో ఉన్నాయని, వాటిని వీఆర్వోలతో కలిసి వచ్చే వారంలోగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే జాయింట్ ఎల్ పి ఎం లు ఉన్న రైతులు ఈ నెల 30 లోగా 50 రూపాయలు చలానా చెల్లించి సబ్ డివిజన్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఐ జెర్మియా, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, ఆయా గ్రామాల వీఆర్వోలు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు