Thursday, June 5, 2025
Homeజిల్లాలుకర్నూలువృద్దులకు రేషన్ ఇంటి వద్దకే...

వృద్దులకు రేషన్ ఇంటి వద్దకే…

ఫోటో రైటప్ :విలేకరులతో మాట్లాడుతున్న తహశీల్దార్ గీతా ప్రియదర్శిని

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న వృద్దులు, వికలాంగులకు ఈనెల 5 లోగా బియ్యం ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలని తహసీల్దార్ గీతా ప్రియదర్శిని తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాల రేషన్ డీలర్లు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వృద్దులు, వికలాంగులు రేషన్ కోసం దుకాణాలకు రప్పించుకోవద్దని, వారికి ఇంటి వద్దకే పంపిణీ చేయాలన్నారు. మిగిలిన కార్డుదారులకు ఈనెల 15 వరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు