Wednesday, June 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాబ్ మేళాకు స్పందన.. ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి

జాబ్ మేళాకు స్పందన.. ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ కళాశాల/పీజీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన రావడం జరిగిందని ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో రెండు కంపెనీలు, కేఎల్ గ్రూప్స్ అమెజాన్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ తరఫున రఘునాథరెడ్డి, ఆర్డిజి టెక్నికల్ సపోర్ట్ తరఫున ఇర్షాద్ అహ్మద్ ఇంటర్వ్యూలను నిర్వహించారు అని తెలిపారు. జాబ్ మేళాకు మొత్తం 78 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో కే ఎల్ గ్రూప్స్కు 11 మంది ఆల్ డిజి టెక్నికల్ సపోర్ట్ కు 6 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులందరినీ శ్రీ బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ పల్లె వెంకట కృష్ణ కిషోర్ కళాశాల ప్రిన్సిపాల్ తదితర అధ్యాపకులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు