Thursday, June 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమిషన్ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహణ..

మిషన్ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహణ..

ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిధిలోని పాఠశాలలు అభివృద్ధి ప్రణాళిక విషయంపై సమీక్ష సమావేశమును ఎంపీడీవో సాయి మనోహర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పరిశుభ్రత పెంపొందించడంపై ప్రత్యేక శ్రద్ధను కనపరచాలన్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులు తమ పిల్లలుగా భావించి, నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు నాంది పలకాలని తెలిపారు. పాఠశాల ఆవరణ ముందు గల కలుపు మొక్కలను తొలగించి పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రంగా చేయడంపై హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శ్రద్ధను ఘనపరచాలని తెలిపారు. ప్రణాళిక ప్రకారం క్రమబద్ధంగా శుభ్రపరిచే కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేపట్టినచో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 12వ తేదీ లోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు హెడ్మాస్టర్లు ముందు ఉండాలని వారు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత కోసం అన్ని శాఖల సహకారం ఎంతో హత్య అవసరమని వారు నొక్కి చెప్పడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులు హెడ్మాస్టర్లు సమిష్టిగా కృషిచేసి పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు రాజేశ్వరి దేవి గోపాల్ నాయక్, మండల పరిధిలోని హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు