Friday, June 6, 2025
Homeజిల్లాలుఅనంతపురంఅన్నదాత సుఖీభవ క్రింద తక్షణమే రూ. 20 వేలు అందజేయాలి

అన్నదాత సుఖీభవ క్రింద తక్షణమే రూ. 20 వేలు అందజేయాలి

90 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలి…

9న ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ధర్నా లను జయప్రదం చేయండి…
జిల్లా రైతు సంఘం ప్రధానకార్యదర్శి చిరుతల మల్లికార్జున పిలుపు
విశాలాంధ్ర -అనంతపురం : ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులు కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ క్రింద ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 వేలు తక్షణమే రైతుల అకౌంట్లో జమ చేయాలని, 90% సబ్సిడీతో 5 ఎకరాలకు సరిపడు విత్తనాలు ఇవ్వాలని డిమాండ్లతో ఈనెల 9వ తారీఖున జిల్లా వ్యాప్తంగా మండల కార్యాలయం దగ్గర ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చెన్నప్ప యాదవ్ చిరుతల మల్లికార్జునలు సంయుక్తంగా శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈసంధర్బంగా వారు మాట్లాడుతూ రైతులకు మరియు కౌలు రైతులకు 90% సబ్సిడీతో కల్తీలేని విత్తనాలు ఇవ్వాలని కౌలుసాగుచేసే రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. రైతులకు, కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలు సాగుఖర్ఛులు అధికమవుతున్నందున స్కేలుఅప్ ఫైనాన్స్ ఏకరాకు రూ. 50 వేలు ప్రకారం ఇవ్వాలన్నారు. బంగారు పంట ఋణాలను వడ్డీ మాత్రమే కట్టించుకోని బ్యాంకర్లు రెన్యూవల్ చేయాలన్నారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ అన్నదాత సుఖీభవ పథకం 20 వేల రూపాయలు తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని,
కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం కు వర్తింపచేయాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం సి2+50% ప్రకారం పెంచాలన్నారు. రైతులందరికీ పంటల భీమా ప్రీమియము ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు