సత్యసాయి జిల్లా తెలుగుయువత ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుమలేశ్
విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఎల్లిజిబుల్ ఉన్న ప్రతి విద్యార్థికి తల్లికివందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మంది విద్యార్థులకు రూ.15 వేల రూపాయలు విద్యార్థి తల్లి అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్పిన విధంగా డబ్బులు జమచేయడం ఒక చారిత్రత్మకం అని తెలుగుయువత జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుమలేశ్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల తల్లితండ్రుల కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విద్యా శాఖ మంత్రి నారా లోకేషకు పాలాభిషేకం తో హర్షం వ్యక్తం చేయడం జరుగుతున్నదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం ఇవ్వడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు తరపున కూటమి ప్రభుత్వానికి తెలుగుయువత సత్యసాయి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గా తాను ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తల్లికి వందనం పథకం ఒక చారిత్రాత్మకం…
RELATED ARTICLES