విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సచివాలయ ఉద్యోగులు తమ బదిలీలు, తదితర సమస్యలపై నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయం ఉద్యోగులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమస్యలను మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు దృష్టికి తీసుకొనిపోవడం జరిగిందన్నారు. న్యాయపరంగా మాకు న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. హరీష్ బాబుతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని పలు విషయాలను వారికి తెలియజేశారు. ఏపీ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా ప్రధాన కార్యదర్శి పులిబంద్ల నరసింహారావు పాల్గొని,వారు హరీష్ బాబును కలిసి, ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 5, తేదీ: 12.06.2025 లోని నిబంధనలపై తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ వినతిపత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు.ముఖ్యంగా, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు విధుల్లో ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన తరువాత తప్పనిసరిగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలనే నిబంధన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందన్నారు. మాకు ఇచ్చే వేతనాలతో ఇతర ప్రాంతాలకు వెళితే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందన్న సమస్యను వారు తెలపడం జరిగిందన్నారు. ఇది ఉద్యోగుల కుటుంబ జీవితంపై, పిల్లల చదువు, గృహ ఆర్థిక స్థితి, సామాజిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అలాగే ఉద్యోగులు పుట్టి పెరిగిన స్వగ్రామ ప్రాంతాల్లోనే సేవలందించగలగడం వల్ల వారు సామాజికంగా, కుటుంబపరంగా సుస్థిరంగా ఉండగలుగుతారని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ, ఉద్యోగుల అభ్యర్థనను దృష్టిలో ఉంచుకొని, సంబంధిత జీవోపై మానవతా దృక్పథంతో పునఃసమీక్ష జరిపేలా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల సంక్షేమం మా ప్రభుత్వానికి ప్రాముఖ్యత కలిగిన అంశం అని,ఉద్యోగుల కోణంలో చూస్తే, బదిలీల విషయంలో ఒక సరళమైన, సున్నితమైన విధానం అవసరమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. మీరు తెలిపిన సమస్యలను ఆరోగ్యశాఖమంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా, ఈ జీవో పట్ల ఒక సానుకూల, న్యాయమైన పునఃసమీక్ష జరగడం కోసం మా తరపున ప్రయత్నిస్తాం అని హామీ ఇచ్చారు.
సచివాలయ ఉద్యోగుల సంఘం నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబుకు వినతిపత్రం
RELATED ARTICLES