Friday, June 6, 2025
Homeజాతీయంరాహుల్ గాంధీ మోదీ సరెండర్ వ్యాఖ్యలకు శశిథరూర్ కౌంటర్

రాహుల్ గాంధీ మోదీ సరెండర్ వ్యాఖ్యలకు శశిథరూర్ కౌంటర్

అమెరికా పర్యటనలో అఖిలపక్ష బృందానికి శశిథరూర్ నాయకత్వం
ఆపరేషన్ సిందూ విషయంలో మూడో పక్షం జోక్యం చేసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అక్కడ అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ాఆపరేషన్ సిందూర్్ణ గురించి రాహుల్ గాంధీ చేసిన నరేంద్ర మోదీ సరెండర్్ణ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు థరూర్ బదులిచ్చారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పడంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా థరూర్ ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు.ఆపరేషన్‌ను ఆపడానికి భారత్‌ను ఎవరూ ఒప్పించాల్సిన అవసరం రాలేదు. మమ్మల్ని ఆపమని ఎవరూ చెప్పనక్కర్లేదు, ఎందుకంటే పాకిస్థాన్ ఆపిన మరుక్షణమే మేమూ ఆపడానికి సిద్ధంగా ఉన్నామని వారికే (పాకిస్థాన్‌కు) మేం చెప్పాం అని ఆయన వివరించారు. భారత్ ఆగడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు కూడా ఆగడం మంచిది అని పాకిస్థాన్‌తో అమెరికా చెప్పి ఉంటే అది వారి గొప్పతనం అవుతుందని థరూర్ అభిప్రాయపడ్డారు. వారు (అమెరికా) అదే చేసి ఉంటే, అది వారి వైపు నుంచి ఒక అద్భుతమైన చర్యఁ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, నిర్ణయాత్మక ప్రక్రియలో మాత్రం భారత్ స్వతంత్రంగానే వ్యవహరించిందని, బయటి శక్తుల ప్రమేయం లేదని థరూర్ తేల్చిచెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు