భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో.. సరిహద్దు జిల్లాలపై పాక్ వైపు నుంచి దాడుల ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే పంజాబ్లోని చండీగఢ్లో నేటి తెల్లవారు జామున మరోసారి సైరన్ల మోత వినిపించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దాడులు జరిగే అవకాశం ఉందంటూ.. ఎయిర్ఫోర్స్ స్టేషన్ ఈ హెచ్చరిక జారీ చేసింది.. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించింది. బాల్కనీల్లోకి కూడా రావొద్దని స్పష్టం చేసిన తరుణంలో చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ కూడా ఓ హెచ్చరిక జారీ చేశారు.. జమ్ములోనూ ఈ ఉదయం సైరన్లు మోగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలలో తలదాచుకోవాలని కోరింది..