ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి ఈనెల 11వ తేదీ పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరి ప్రదర్శన, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనార్థం ఉదయం 6 గంటలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని డిపో మేనేజర్ వి. సత్యనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రానుపోలు చార్జీలు 1400 రూపాయలు మాత్రమేనని తెలిపారు. దర్శనానికి వెళ్లవలసిన భక్తాదులు ఆన్లైన్లో కానీ ,బస్టాండ్ లో రిజర్వేషన్ కౌంటర్లో గాని సీట్లను రిజర్వేషన్ చేసుకునే అవకాశం కలదని తెలిపారు. “భగవంతుని సేవలో భక్తులు ఉంటారని, భక్తుల సేవలో ఏపీఎస్ఆర్టీసీ” ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 6303151302 కు గాని 9959225859 గాని సంప్రదించవచ్చునని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని భక్తాదులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
అరుణాచలం గిరి ప్రదర్శనకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు..
RELATED ARTICLES