Homeఆంధ్రప్రదేశ్దూసుకొస్తున్న తుపాను.. ఏపీకి భారీ వర్ష సూచన

దూసుకొస్తున్న తుపాను.. ఏపీకి భారీ వర్ష సూచన

- Advertisement -

బంగాళాఖాతంలో 48 గంటల్లో తుపానుగా మారనున్న అల్పపీడనం

తుపానుగా మారితే సెన్యార్ అని నామకరణం
ఆంధ్రప్రదేశ్ తీరంలో 29, 30 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో తుపాను ముంచుకొస్తోంది. మలేషియా, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ, రాబోయే 24 గంటల్లో అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడనుంది.

ఈ వాయుగుండం మరింత తీవ్రరూపం దాల్చి తుపానుగా మారితే దానికి ఃసెన్యార్ః అని పేరు పెట్టనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సూచించిన ఈ పేరుకు ఃసింహంః అని అర్థం. వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం, వాయుగుండం తుపానుగా మారిన తర్వాతే అధికారికంగా పేరు ప్రకటిస్తారు.

ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాంలో నవంబర్ 29న భారీ వర్షాలు, నవంబర్ 30న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే, నవంబర్ 27, 28 తేదీల్లో ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని హెచ్చరించింది. తమిళనాడులో నవంబర్ 24 నుంచి 30 వరకు పలు దఫాలుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కేరళ, లక్షద్వీప్‌లలో కూడా వర్ష సూచన ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న ఆరు రోజుల పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

ఇదిలా ఉండగా, కొమోరిన్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక సమీపంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు