కురుబ సంఘం, యువజన ఉద్యోగుల సంఘం
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని కురుమ కులానికి చెందిన పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేస్తామని యువజన ఉద్యోగుల సంఘం వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి లో 500 మార్కులు పైబడిన వారు, ఇంటర్మీడియట్ లో 900 మార్కులు పైబడిన విద్యార్థులు మే నెల20వ తేదీ లోపల కుల ధ్రువీకరణ పత్రము, మార్కుల జాబితా జిరాక్స్ లను యశోదమ్మ ,వకీలు పెద్దయ్య కురుబ కళ్యాణమండపం, ధర్మవరం చిరునామాకు అందజేయాలన్నారు. అదేవిధంగా ఐఐటి ఇంజనీరింగ్, నీట్ ఎంబిబిఎస్ నందు సీట్లు సాధించిన విద్యార్థులు, గ్రూప్ వన్, గ్రూప్ టు తదితర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారందరికీ సన్మానం నిర్వహించబడును అని తెలిపారు. (మా ద్వారా సమాచారం ఇచ్చిన వారికి మాత్రమే) మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 990 8387330 లేదా 9491867165కు గాని 9440808732 కు సంప్రదించాలని తెలిపారు.
కురుబ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
RELATED ARTICLES