Friday, June 13, 2025
Homeజిల్లాలుఅనంతపురంఅవాస్ యోజన కింద యూనిట్ కు పది లక్షలు ఇవ్వాలి

అవాస్ యోజన కింద యూనిట్ కు పది లక్షలు ఇవ్వాలి

అత్యాచారాల నిరోధక చట్టంలోని నిబంధనలను కఠినంగా అమలు చేయాలి

ఆర్డీవో కు వినతి పత్రం అందజేసిన బి కే యం యూ జాతీయ కార్యవర్గ సభ్యులు బి కేశవరెడ్డి

విశాలాంధ్ర అనంతపురం : అవాస్ యోజన కింద యూనిట్ కు పది లక్షలు ఇవ్వాలని ఎస్సీ ఎస్టి అత్యాచారాల నిరోధక చట్టంలోని నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆర్డీవో కు బి కే యం యూ జాతీయ కార్యవర్గ సభ్యులు బి కేశవరెడ్డి మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సమస్యలను పూర్తిగా పక్కన పెట్టిందన్నారు. అధికారంలోకి రాక మునుపు ఎన్నికలలో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తానని వాగ్దానం చేయడం జరిగిందన్నారు. ఇంతవరకు ఆ హామీలు అమలుకు నోచుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులు, పేదల సమస్యలను పక్కన పెట్టారన్నారు.
వ్యవసాయ కార్మికులు దేశ వ్యవసాయానికి మరియు అభివృద్ధికి వెన్నెముక.దేశ ఆర్థిక అభివృద్ధికి
వారి గొప్ప సహకారం ఉన్నప్పటికీ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కారణంగా వారి జీవన మరియు పని పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. వ్యవసాయ కార్మికులకు సాధికారత కల్పించడానికి, దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న సమగ్ర కేంద్ర చట్టాన్ని అమలు చేయాలి, వారి హక్కులు మరియు ప్రయోజనాలను కాపాడాలన్నారు.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు జిల్లాల్లో వ్యవసాయ, ఇతర గ్రామీణ కార్మికుల రక్షణ కోసం చట్టబద్ధమైన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రకటించిన మిగులు భూమి, ప్రభుత్వ అన్ని రకాల భూములను, భూమిలేని వారందరికీ, దళితులకు, వ్యవసాయ కార్మికులకు, గిరిజనులకు మరియు సన్నకారు పేద రైతులకు పంపిణీ చేయాలి.కౌలు రైతుల రక్షణ, భూమిలేని కుటుంబాలకు తగిన ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.
ఐ ఎల్ ఓ యొక్క మంచి పని యొక్క చట్రంలో ఉపాధికి హామీ ఇవ్వాలంటే నిరంతర ఉపాధి, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత మరియు సామాజిక సంభాషణ. ఎంజైరేగా కింద 200 రోజుల పని మరియు రోజువారీ వేతనం రోజుకు రూ. 700 రూపాయలు, మరియు చట్టం ప్రకారం అమలును నిర్ధారించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీలో పెండింగ్లో ఉన్న బకాయిలను వడ్డీతో తక్షణమే చెల్లించాలన్నారు. వ్యవసాయ కార్మికులందరికీ 55 సంవత్సరాల వయస్సులో నెలకు రూ. 10 వేలు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నారు. కేజీ నుండి పీజీ వరకు అందరికీ ఫీజు లేని నాణ్యమైన విద్యను అందించాలి.
ఎస్సీ & ఎస్టి (అత్యాచారాల నిరోధక) చట్టంలోని నిబంధనలను కఠినంగా అమలు చేయడం మరియు వేగవంతమైన విచారణను నిర్ధారించడం మరియు అన్ని జిల్లాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తప్పనిసరి చేయాలన్నారు.
దేశవ్యాప్తంగా కుల గణనను సాధారణ జనాభా గణనతో పాటు నిర్వహించాలన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తక్షణమే అమలు చేయాలని ఆర్డిఓ ద్వారా కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కృషి చేస్తారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులు రామాంజనేయులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మల్లికార్జున గౌడ్. కుల్లాయప్ప. రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు