అనంతపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషన్ నాగ ముద్దయ్య.
విశాలాంధ్ర ధర్మవరం;; దీర్ఘకాలికంగా సారాయి కేసులోని ముద్దాయిలను త్వరగా అరెస్టు చేయాలని అనంతపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగ ముదయ్య
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవోదయం 2.0 లో భాగంగా బుధవారం నాడు అనంతపురం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ నాగమద్దయ్య, అనంతపురం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపర్డెంట్ శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు అకస్మాత్తుగా ధర్మవరం ఎక్సైజ్ కార్యాలయాన్ని తనిఖీ చేసారు. ఈ తనిఖీ లో స్టేషన్ లోని పలు రికార్డులను నిసితంగా పరిశీలించినారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లోనూ సారాయి కేసులోని ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండకూడదని, వేగవంతంగా అరెస్టు అయ్యేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే నవోదయం 2.O లో భాగంగా ధర్మవరం ప్రోహిబిషన్ ,ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలలో సారాయి రహిత గ్రామాలు గా తీర్చిదిద్దాడానికి అందరూ కృషి చేయాలి అని సిబ్బంది కి సూచించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ధర్మవరం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రమణి, సబ్- ఇన్స్పెక్టర్ చాంద్ బాష , నాగరాజు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సారాయి కేసులోని ముద్దాయిలను త్వరగా అరెస్టు చేయాలి…
RELATED ARTICLES