యువర్స్ ఫౌండేషన్, ఆర్డిటి అభిమానులు
విశాలాంధ్ర -ధర్మవరం; ఆర్ డి టి సేవలను తిరిగి కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే అనుమతిని మంజూరు చేసేలా చర్యలు గైకొనాలని యువర్స్ ఫౌండేషన్, ఆర్డిటి సంస్థ అభిమానులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమావేశాన్ని నిర్వహించి, ఆర్డిటికీ సంఘీభావాన్ని తెలిపారు. అనంతరం సభాధ్యక్షులు డాక్టర్ సత్య నిర్ధారణ మాట్లాడుతూ ఫెర్రర్ మతాలకు అతీతంగా చేస్తున్న స్వచ్ఛంద సేవలు సఫలీకృతమై కుటుంబ అభివృద్ధికి సామాజిక అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఆర్డిటి స్వచ్ఛంద కార్యక్రమాలలో కూడా సేవకు ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. తదుపరి పోలా ప్రభాకర్, ఆదర్శ సేవా సంఘం ప్రతినిధి కృష్ణమూర్తి, యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కౌన్సిలర్ కేత లోకేష్ మాట్లాడుతూ హంగులకు ఆర్పాటాలకు కాకుండా చక్కనైన కార్యాచరణ ప్రణాళికతో హేతుబద్ధమైన స్వచ్ఛంద సేవలను అందించడం ఆర్ డి టి కే సాధ్యమని తెలిపారు. ఆర్డిటి అందించే ప్రతి సేవ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రమాణికంగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆర్డిటి సేవలను కొనసాగించేలా ప్రభుత్వాలు కూడా సానుకూలంగా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తదుపరి ఆర్ డి టి సంస్థ నడప డుచున్న వివిధ గ్రామాల విద్యార్థుల ద్వారా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
ఆర్డిటి సేవలను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు గైకొనాలి..
RELATED ARTICLES