Tuesday, February 25, 2025
Homeజాతీయంకంచె చేనును మేసేసింది .. బెంగ‌ళూరులో ఘాతుకం

కంచె చేనును మేసేసింది .. బెంగ‌ళూరులో ఘాతుకం

ఓ యువకుడు తనపై లైంగిక‌దాడి చేశాడని, న్యాయం చేయాల‌ని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిందో బాలిక. ఫిర్యాదు తీసుకుని చర్యలు తీసుకోవాల్సిన కానిస్టేబుల్ ఆమెపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డ‌ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఆ దారుణాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడంతో ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయిందా బాలిక. గతేడాది జులైలో జరిగిన దారుణం తాజాగా బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు యువకుడితో పాటు కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదు చేసి ఇద్దరినీ క‌ట‌క‌టాల్లోకి నెట్టారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. స్నేహం పేరుతో దగ్గరైన విక్కీ అనే యువకుడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక మైకో లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అరుణ్ అనే కానిస్టేబుల్ ఆ బాలికకు సహాయం చేస్తానని నమ్మబలికాడు. అనంతరం మాయమాటలు చెప్పి, ఓ హోటల్ కు తీసుకువెళ్లి మద్యం తాగించాడు. ఆ మత్తులో బాలికపై అఘాయిత్యం చేశాడు. ఆపై వీడియోలు తీసి ఈ దారుణాన్ని ఎవరికైనా చెబితే వాటిని ఇంటర్ నెట్‌లో పెడతాన‌ని బెదిరించాడు. దీంతో బాలిక భయాందోళనలకు గురై మౌనంగా ఉండిపోయింది. గతేడాది జులైలో ఈ దారుణం జరగగా ఇటీవల బాధితురాలు ఆ విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో మైకో లేఔట్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు విక్కీతో పాటు కానిస్టేబుల్ అరుణ్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు