ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు
విశాలాంధ్ర – నల్లజర్ల : రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుందని వాటిని రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనతరం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతన్నల ఇంటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యుద్ధన పూడి బ్రహ్మరాజు, మండల పార్టీ అధ్యక్షులు తాతిన సత్యనారాయణ, సర్పంచ్ టీ బాలయ్య, వ్యవసాయ అధికారి బి సోమశేఖర్, అధికారులు, రైతన్నలు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.


