శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం అధ్యక్షులు పుత్త రుద్రయ్య
విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని మార్కెట్ వీధిలో గల శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో శ్రీ భద్రావతి శ్రీ భావన రుషింద్రుల స్వామివారి 60వ కళ్యాణ మహోత్సవ వేడుకలు ఈనెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండవ రోజు అర్చకుల వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధ్యక్షులు పుత్త రుద్రయ్య మాట్లాడుతూ ఈ కళ్యాణ మహోత్సవాలకు ఉభయ దాతలుగా 85 మంది వ్యవహరించడం పట్ల ఆలయం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం స్వామివారి కల్యాణ వేడుకలకు అన్నదానం లడ్డు ప్రసాదానికి 25 మంది విరాళాలు సమర్పించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి సాయంత్రం ఉత్సవ మూర్తుల గ్రామోత్సవం పట్టణ పురవీధులలో ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామోత్సవములో దీపోత్సవాన్ని చిన్నపిల్లలు, ఆడపిల్లలు, ముత్తైదువులు పాల్గొని విజయవంతం చేశారు. అన్నదాన కార్యక్రమానికి వేలాదిమంది భక్తాదులు, కుల బాంధవులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మే టీకాల బాల కుల్లాయప్ప, ఉపాధ్యక్షులు జింక నాగభూషణ, కోశాధికారి వడుకుల భాస్కర్, సహాయ కార్యదర్శులు, సమన్వయ కమిటీ సభ్యులు, కార్య నిర్వాహక సభ్యులు డైరెక్టర్లు పాల్గొన్నారు.
హాజరైన పరిటాల శ్రీరామ్, చిలక మధుసూదన్ రెడ్డి;; స్వామివారి 60వ కళ్యాణ మహోత్సవ వేడుకలకు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాజరై, వివాహాన్ని కన్నుల పండుగగా తిలకించారు. తొలుత వీరికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. వీరి పేరిటన ఆలయంలో ప్రత్యేక పూజలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


