Friday, June 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచక్కటి విద్యను అందించినప్పుడే ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది

చక్కటి విద్యను అందించినప్పుడే ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది

జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి సయ్యద్ మౌలా
విశాలాంధ్ర -ధర్మవరం : చక్కటి విద్యను విద్యార్థులకు అందించినప్పుడే ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి సయ్యద్ మౌలా తెలిపారు.ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాలలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కళాశాలకు సంబంధించిన పలు రికార్డులను వారు పరిశీలించారు. ఇంతవరకు కళాశాలలో అడ్మిషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అడ్మిషన్ విషయంలో నిర్లక్ష్యం ఉండరాదని, ఏ విద్యార్థి నైనా తప్పనిసరిగా కళాశాలలో ప్రవేశం చేసుకోవాలని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం బోధించేందుకు అధ్యాపకుల కొరత లేదని, గత సంవత్సరము కన్నా, మరలా వచ్చే సంవత్సరంలో ఉత్తీర్ణతా శాతమును పెంచుతూ, విద్యార్థుల చదువు అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందించే సంక్షేమ పథకాలను తల్లిదండ్రులకు అడ్మిషన్ విషయంలో గుర్తుచేయాలని తెలిపారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తల్లిదండ్రులకు వివరించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు పూర్తి దశలో కల్పిస్తుందని వారు తెలిపారు. ప్రారంభ రోజు నుంచే సిలబస్లను బోధించాలని అనుకున్న సమయంలోనే సిలబస్ను పూర్తి చేయవలసిన బాధ్యత అధ్యాపకులు దేనిని వారు తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఇప్పటికే జిల్లాలో తక్కువ ఉత్తీర్ణ శాతం వచ్చిన కళాశాలలపై చర్యలు తీసుకోవడం జరిగిందని వారు గుర్తు చేశారు. కళాశాలకు మొట్టమొదటిసారిగా వచ్చిన సయ్యద్ మౌలాను అధ్యాపకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి, ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ వలితా వాణి, కళాశాల అధ్యాపకులు, బోధ నేతల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు