టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం;: పట్టణములోని డ్రైనేజీ కాలవల్లో పేరుకుపోయిన షి ల్ట్ తీయమంటే, ఏకంగా రోడ్లు కాలువలు వ్యాపార సముదాయాల పునాదులు కూడా తవ్వి వ్యాపారస్తులకు రెండు కోట్లు నష్టం తేవడం ఎంతవరకు సమంజసమని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా పట్టణంలో కాలువల పూడికతీతే విషయంలో వ్యాపారానికి దెబ్బ తీసే విధంగా పెద్ద గుంతలు తవ్వడం, జెసిబి తో పనులు చేయించడం వల్ల కొన్ని రోజులుగా తమ వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్న విషయాన్ని పరిటాల శ్రీరామ్ దృష్టికి వ్యాపారస్తులు తీసుకొని వెళ్లారు. ఇందులో భాగంగానే పరిటాల శ్రీరామ్ పట్టణానికి చేరుకొని మున్సిపల్ అధికారులు చేస్తున్న పనులను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు చేపట్టిన ఈ చర్యలకు వ్యాపారస్తులకు కలిగిన నష్టాన్ని ఎవరు బరిస్తారని శ్రీరామ్ అసహనం వ్యక్తం చేశారు. తదుపరి అక్కడి వ్యాపారస్తులతో నేరుగా పరిటాల శ్రీరామ్ మాట్లాడి వారి సమస్యలను కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి పనులకు 30 లక్షలు నిధులు కూడా మంజూరు కావడం మనసులతో చేయించాలి గాని, జెసిబి లతో చేయించడం సరైన పద్ధతి కాదు అని వారు ప్రశ్నించారు. జెసిబి తో పనులు చేయించడం వల్ల భవనాల పునాదులు రోడ్లు కూడా దెబ్బతిన్నాయని వారు తెలిపారు. ఏకంగా వ్యాపారస్తులు రెండు కోట్ల వరకు వ్యాపారాలు నష్టపోయారు కదా? కనీసం ఆలోచన చేయాల్సిన కమిషనర్ కూడా అత్యవసరంగా ఇలాంటి పనులు ఎందుకు చేశారో ప్రజలకు జవాబు చెప్పాలని వారి డిమాండ్ చేశారు. అంతేకాకుండా రోడ్లపై వేయడం వలన వాహనదారులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తవ్వకాలు చేయడం తప్పు కాదా? అని మున్సిపల్ అధికారులను వారు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వములో ఇలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వద్దని వారు సలహా ఇచ్చారు. అధికారులు కాంట్రాక్టర్లు వ్యాపారులతో చర్చించి ఎవరికి ఇబ్బంది లేకుండా నష్టం లేకుండా ఇకనుంచి పనులు చేయాలని వారు సూచించారు. త్వరితగతిన అధికారులతో మాట్లాడి వ్యాపారస్తులకు తగిన న్యాయం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.
మున్సిపల్ అధికారులు రెండు కోట్లు నష్టం కలిగించారు..
RELATED ARTICLES