అధ్యక్షులు వీరనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం : పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడంలో నిజమైన సంతృప్తి సంతోషం లభిస్తుందని శ్రీ షిరిడి సాయి సేవాసమితి అధ్యక్షులు వీర నారాయణ, ఉపాధ్యక్షులు టి. సి. నారాయణ రెడ్డి ,కార్యదర్శి జలదంకి సూర్యనారాయణ ,డైరెక్టర్ సూర్య ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పుట్టపర్తి రోడ్, సత్య సాయి నగర్ లో గల షిరిడి సాయిబాబా ఆలయ ఆవరణములో ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమును షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ వారు నిర్వహించారు. ఈ శిబిరం శిరిడి సాయిబాబా సేవా సమితి, జిల్లా ఆందోత్వ నివారణ సంస్థ – శ్రీ సత్య సాయి జిల్లా, పుష్పగిరి కంటి ఆసుపత్రి – కడప వారి సహాయ సహకారాలతో నిర్వహించారు. అనంతరం సేవా సమితి కమిటీ వారు మాట్లాడుతూ ఈ కంటి శిబిరానికి 150 మంది కంటి రోగులు పాల్గొనగా కంటి వైద్య చికిత్సలను కడప ఆసుపత్రి వైద్యులు నిర్వహించగా 75 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా షిరిడి సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు ఆలయంలో 150 మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి గురువారం ఆలయంలో షిరిడీలో జరిగే విధంగా, సాంప్రదాయ పద్ధతిలో పూజలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా కంటి నిపుణుల సలహాలతో కంటికి ఉచిత లెన్స్ కూడా అమర్చబడుతున్నామని తెలిపారు. ఉచిత వైద్యం, ఉచిత ఆపరేషన్, ఉచిత వసతి అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా శిబిరంలో చిన్న పిల్లలకు వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఉచిత కంటి పరీక్షలను నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారితోపాటు, ప్రజలు పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడంలో నిజమైన సంతృప్తి, సంతోషం ఉంది..
RELATED ARTICLES