Wednesday, June 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు స్థలం ఇవ్వాలి

అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు స్థలం ఇవ్వాలి

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి. జాన్సన్ బాబు

సిపిఐ నియోజక వర్గ కార్యదర్శి ముసుగు మధు

విశాలాంధ్ర ధర్మవరం; భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా ధర్మవరం పట్టణం, రూరల్ ప్రాంతాల్లో అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు గృహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన హామీని అమలు చెయ్యాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్సన్ బాబు, ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి మూసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా పేదల సొంతింటి కల నెరవేర లేదని,కూలి నాలి చేసుకుంటున్న పేద ప్రజలు బాడుగ ఇళ్లకు అద్దె కట్టలేక పిల్లల చదువులు ఫీజులు, జీవనాధారానికి కావలసినంత ఆదాయం లేక చాలా ఇబ్బందులు పడుతూ దుర్భర జీవితం గడుపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసిపి ప్రభుత్వం పట్టణ,గ్రామాల్లో ఒకటిన్నర సెంటు 1,80,000 గృహ నిర్మాణం కోసం ఇచ్చినవి ఎందుకు సరిపోలేదని? ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో, రెండు సెంట్లు గృహ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే పక్క ఇల్లు కట్టించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు ఎర్రం శెట్టి రమణ, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం అధ్యక్షులు, గోవిందరాజు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, తాజుద్దీన్,చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, చేనేత కార్మిక గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, చెన్నంపల్లి శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి భూషణ,యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మికులు రామకృష్ణ, రామసుబ్బయ్య, సురేంద్ర, నాగేంద్ర, వేణుగోపాల్,చిన్న, జనార్దన్, పీరా,మహిళా సమాఖ్య నాయకురాలు లింగమ్మ ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు