టిబెట్లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో పొరుగు దేశమైన నేపాల్లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (ఈఎంఎస్సీ) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఈ సంస్థ పేర్కొంది.కాగా, భారత జాతీయ భూకంప పరిశోధన కేంద్రం (ఎన్సీఎస్) మాత్రం భూకంప తీవ్రతను 5.0గా నిర్ధారించింది. టిబెట్లో సంభవించిన ఈ భూకంపం కారణంగా నేపాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో, భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. గత గురువారం కూడా టిబెట్లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అప్పట్లో దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైందని, భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
మరోసారి కంపించిన టిబెట్.. నేపాల్ వరకు ప్రభావం
- Advertisement -
RELATED ARTICLES


