Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్నిర్మాణం పూర్తయ్యాకే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలి..

నిర్మాణం పూర్తయ్యాకే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలి..

- Advertisement -

కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశం

నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను ప్రతి శనివారమూ లబ్ధిదారులకు కేటాయించాలని ఏపీ పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వచ్చే ఏడాది జూన్‌ ముగింపు వరకు ఈ ఇళ్ల నిర్మాణాన్ని వంద శాతం పూర్తిచేయాలని మంత్రి సూచించారు. ప్రక్రియకు సంబంధించిన ఆదేశాలు మంగళగిరిలోని రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి పురపాలక, నగర పంచాయతీ కమిషనర్ల సమావేశంలో ప్రకటించారు.పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది
ఁపట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అందుబాటును పెంచడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టుల పనులను 2029 నాటికి పూర్తిచేయడం అత్యవసరం. ఘన వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీ, రోడ్ల బలోపేతం, వీధీ దీపాల నిర్వహణ వంటి అంశాలను సమగ్రంగా చేపట్టాలి. జనవరి నుండి ఘన వ్యర్థాల నిర్వహణను పూర్తిస్థాయిలో అమలు చేయడం అవసరం. అలాగే, డంపింగ్‌యార్డుల లేని, శుభ్రంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన పట్టణ, నగరాలను నిర్మించాలిఁ అని నారాయణ ఆదేశించారు.

రెండేళ్లలో 90% ఇళ్లకు తాగునీరు
రాబోయే రెండు సంవత్సరాల్లో అమృత్‌ 2.0 పథకం ద్వారా పట్టణాల్లోని 90% ఇళ్లకు రక్షిత తాగునీరు అందించే దిశగా ముందుకెళుతున్నాం.దీనికి సంబంధించిన తాగునీటి ప్రాజెక్టులను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని, ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన సూచించారు.
అంతేకాక, డ్రైనేజీ, రోడ్లు, వీధీ దీపాల నిర్వహణకు సంబంధించిన నిధులను పట్టణ కమిషనర్లు సమర్థవంతంగా వినియోగించాల్సినదని మంత్రి గుర్తు చేశారు.సమావేశంలో పురపాలక శాఖ సంచాలకులు సంపత్ కుమార్, టిడ్కో ఎండీ సునీల్ కుమార్ రెడ్డి, ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు