Friday, January 23, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదేశం కోసం ప్రాణాలు డిన్న వెంకటసుబ్బయ్యకు నివాళులు

దేశం కోసం ప్రాణాలు డిన్న వెంకటసుబ్బయ్యకు నివాళులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : దేశం కోసం ప్రాణాలు వొడ్డిన వెంకటసుబ్బయ్యకు ఆదర్శ సేవా సంఘం పార్కు సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి, గౌరవాధ్యక్షులు చేన్న ప్రకాష్, కార్యదర్శి నాగార్జున, మారుతి, హెమ్ కుమార్, మాజీ సైనికులు పవన్ కుమార్, నాగభూషణం, ఎన్ఎస్ రెడ్డి, శ్రీధర్ లు పట్టణంలోని పిఆర్టి వీధిలోగల పార్కులో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మృతుడు నార్పల గ్రామానికి చెందిన సైనికుడని, సైన్యంలో కూడా మంచి గుర్తింపు పొందడం జరిగిందని తెలిపారు. వెంకటసుబ్బయ్య మృతి చెందడం బాధాకరమని, వారి త్యాగం ఎందరికో స్ఫూర్తిని ఇస్తుందని తెలిపారు. 30 మంది తోటి జవాన్ల ప్రాణాలను కాపాడి వారు వీర మరణం పొందడం దేశం గర్వించదగ్గ విషయమని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు