Friday, May 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅమర జవాన్లకు ఆదర్శ పార్కులో నివాళులు..

అమర జవాన్లకు ఆదర్శ పార్కులో నివాళులు..

ఆదర్శ సేవా సంఘం, ఆదర్శ పార్కు కమిటీ.
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల ఏడవ తేదీన మన భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసి మన దేశ ఆపరేషన్ సింధూర ద్వారా సైనిక సత్తా నిరూపించడం జరిగిందని ఆదర్శ సేవా సంఘం సంఘ అధ్యక్షులు భీమిశెట్టి కృష్ణమూర్తి గౌరవాధ్యక్షులు చెన్నాసూరి ప్రకాష్ కార్యదర్శి నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర ద్వారా సైనిక సత్తా చూపడం పట్ల వారు సంఘీభావాన్ని ప్రకటించారు. అంతకుమునుపు అమరవీరులకు వారు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలను ఆపరేషన్ సింధూర ద్వారా విజయవంతం తో ధ్వంసం చేయడం మొట్టమొదటి విజయము అని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మారుతి, కుమార్, నాగభూషణం ,ప్రభాకర్ గుప్తా, నాగరాజు, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు