హరీష్ బాబు, పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; స్వాతంత్య్ర పోరాటంలో వడ్డే ఓ బన్న త్యాగాలు మరుపు రానివని, నేటి యువతకు ఆదర్శంగా ఉన్నారని, అటువంటి గొప్ప మహనీయులను మరవరాదని నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు, టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి ఆర్చ్ ఎదురుగా, సిరికల్చర్ కార్యాలయ సమీపంలో గల వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణకు ఆ ముగ్గురు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తదుపరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హరీష్ బాబు, పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో నేడు ప్రజలందరూ ముందుకు వెళ్లాలని తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వలన ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్య కుమార్ యాదవ్ రాలేదని వారు తెలిపారు. వడ్డే ఓ బన్న త్యాగాలు అనంతమైనవని, అంతటి మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ జీవిత చరిత్రను భావితరాలకు పరిచయం చేయాలనే మహత్తర లక్ష్యంతోనే ఈ విగ్రహ ఆవిష్కరణ జరగడం సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు. ఓబన్న కేవలం ఒక స్వాతంత్ర సమరయోధుడే కాదు అని ప్రజావేత్తగా ప్రజల హక్కుల కోసం పోరాడిన మహా నాయకుడు అని తెలిపారు. బ్రిటిష్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలవడం కోసం వీరోచితంగా పోరాడిన మహనీయుడు అని వారు తెలిపారు. నేడు ఈ రోజుల్లో ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మాణాలు జరుగుతున్నాయని, కానీ ఆ రోజుల్లో ఎలాంటి చదువు లేకుండా నగరాలని నిర్మించిన ప్రావీణ్యులు వడ్డేర్లు అని వారు కొనియాడారు. అంతటి నైపుణ్యం ఉన్న వడ్డెర్లు నేటికీ వెనుకబడి ఉన్నారని తెలిపారు. ఈ కులంలో కొంతమంది ఉన్నత శిఖరాలకు కూడా వెళ్లడం జరిగిందని, మరి కొంతమందికి సాయం అందించాల్సిన అవసరం కూడా ఉందని తెలిపారు. వడ్డెర్ల లో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉందని వారి హక్కుల సాధనం కోసం వేసే ప్రతి అడుగులో పరిటాల కుటుంబంతో పాటు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వారు తెలిపారు. రాళ్లు కొట్టే వృత్తిలో చాలామంది ప్రమాదవశాత్తు చనిపోతున్నారని అలాంటి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. టిడిపి ప్రభుత్వంలో కులవృత్తుల వారికి పనిముట్లు కూడా ఇచ్చామని వారు గుర్తు చేశారు. వడ్డెర్ల కోసం ఎంత దూరమైనా నడిచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. తదుపరి విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన ఆర్గనైజర్ను ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం వడ్డెర సంఘం అధ్యక్షులు డేరంగుల అంజి, గౌరవ అధ్యక్షులు డేరంగుల నారాయణస్వామి, ఉపాధ్యక్షులు బండ్లపల్లి రాజు పల్లెకు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి మల్లెల దివాకర్, కో-ఆపరేటర్ డేరంగుల రాజేష్, కార్య నిర్వాహకులు పల్లెపు రమేష్ గోడ్ల వెలగల అంజి, నరేంద్ర, పవన్, శిరారం నారాయణస్వామి, శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షుడు అంజినప్ప, వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్, వడ్డే సీనా, నారప్ప, పోతుకుంట రాజు, రమణ, రవి, తదితరులు పాల్గొన్నారు
స్వాతంత్య్ర పోరాటంలో వడ్డే ఓబన్న త్యాగాలు మరుపురానివి..
RELATED ARTICLES