Saturday, June 21, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాప్రైవేటు స్కూళ్లలో పుస్తకాల పేరిట నిలువు దోపిడీ

ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాల పేరిట నిలువు దోపిడీ

విశాలాంధ్ర- వత్సవాయి : వత్సవాయి మండలం లో ప్రైవేటు పాఠశాలల్లో జోరుగా పుస్తకాలు, యూనిఫామ్‌ లను అమ్ముతు ప్రైవేటుయాజమాన్యాలు నిబంధనలను అతిక్రమిస్తున్నాయి. స్కూల్‌లోనే పుస్తకాలు కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకు ఏకంగా స్కూళ్లల్లోనే స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. బుక్స్‌ మాత్రమే కాదు.. యూనిఫాం, టై, బెల్టులు తమ వద్దనే కొనాలని అంటున్నారు.

వత్సవాయి మండలం లోని ప్రైవేటు పాఠశాలల, యాజమాన్యాలు స్కూల్‌లోనే పుస్తకాలు కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకు ఏకంగా స్కూళ్లల్లోనే స్టాల్స్‌ ఏర్పాటు చేశారు….. బుక్స్‌ మాత్రమే కాదు.. యూనిఫాం, టై, బెల్టులు తమ వద్దనే కొనాలని అంటున్నారు. దీంతో పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌, యూనిఫాం, టై, బెల్టుల అమ్మకాలతో పాఠశాలలు దుకాణాలను మరిపిస్తున్నాయి….. ప్రైవేటు బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యనందించాల్సిన యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా విద్యతో వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి….. అంతేకాదు.. నర్సరీ మొదలుకొని పదో తరగతి వరకు స్టడీ మెటీరియల్‌, అదీ ఇదీ అంటూ వేలాది రూపాయల వసూలు చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…… ఇలా నిబంధనలను భేఖాతరు చేస్తున్నారు……

ఫీజులు ఫుల్లు .. వసతులు నిల్లు….

మండలంలో ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల కంటే ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు వసతులు కల్పించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో సామర్థ్యానికి మించి ఇరుకు గదుల్లో 25 నుంచి 50 వరకు విద్యార్థులను కూర్చొబెట్టి పాఠ్యాంశాలు బోధిస్తుండటంతో పాఠ్యాంశాలు అర్థమయ్యేదెలా అని తల్లిదండ్రులు వాపోతున్నారు…… మరో వైపు కొన్ని పాఠశాలల్లో వందలాది విద్యార్థులుంటే టాయిలెట్లు, బాత్‌రూమ్‌లు ఒకటి రెండు మాత్రమే ఉండటంతో క్యూలో నిలబడి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది…… ఇక నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చిన్నారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది…..

దుకాణం ల అవతారం ఎత్తిన పాఠశాలలు….

పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచే ప్రైవేటు పాఠశాలలు షాపులుగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి పాఠశాల ప్రారంభం నుంచి విద్యార్థుల స్టడీ మెటీరియల్‌ కొనాలనే ఉపాధ్యాయుల ఒత్తిడితో తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతన్నారు. ప్రారంభంలో పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలతో పాఠ్యాంశాలు మొదలుపెట్టాల్సిన ఉపాధ్యాయులు టై, బెల్టులు, యూనిఫాం, షూ, స్టడీ మెటీరియల్‌ తప్పనిసరని చెప్పటంతో విద్యార్థులు తల్లిదండ్రులపై ఆర్థికభారంతో సతమతమవుతున్నారు…….

ప్రైవేటు పాఠశాల ఎలా ఉన్నా పాఠశాలకు పర్మిషన్ ఎలా వస్తుంది… వత్సవాయి మండలంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికీ రేకు ల షెడ్ లోనే కొనసాగుతున్నాయి అధిక శాతం ప్రైవేట్ పాఠశాలలకు ఆటస్థలం కానీ కనీస మౌలిక వసతులు కానీ లేవు.. మరి ఏ విధంగా వారికి అనుమతులు వస్తున్నాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది? ఏళ్ల తరబడి కొన్ని ప్రైవేటు పాఠశాలలు రేకుల షెడ్ లోని నడుస్తున్నాయి ఇదంతా ఒక ఎత్తు కాగా పుస్తకాలు యూనిఫామ్ పేరుతో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా దోపిడీ చేస్తున్నారు ఒక్కొక్క విద్యార్థి నుంచి తరగతులను బట్టి పుస్తకాల కోసం మూడు వేల రూపాయలు నుంచి యూనిఫామ్ టై అనే వంకలతో సుమారుగా 6000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు ఆ ఆ పాఠశాలల విద్యార్థుల నుంచి ప్రభుత్వం ప్రకటించిన ధరల ప్రకారం పుస్తకాలకు వసూలు చేయడం లేదు విద్యార్థులు లెక్క ప్రకారం చలానా కడితే విద్యాశాఖ పుస్తకాలను అందజేస్తుంది ప్రభుత్వం అతి తక్కువ ధరలను పుస్తకాలను సరఫరా చేస్తుండగా ప్రైవేట్ పాఠశాలలు అడ్డగోలుగా వేలాది రూపాయలు వసూలు చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు…

ఫీజుల పట్టిక బహిరంగంగా ఉంచాలి…

కూలీ, నాలీ పనులు చేసుకొని పిల్లలను చదివించాలనే తల్లిదండ్రులకు ఫీజులు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధికంగా ఫీజులు పెంచడంతో నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారింది. అధిక ఫీజులను నియంత్రించాల్సిన అధికారులు సైతం తమకేమి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తూ పాఠశాలల వైపు కన్నెత్తి చూడటం లేదని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల మోత మోగిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బహిరంగంగానే ఫీజుల వివరాలు నోటీసు బోర్డుపై అంటించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు