కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం విజయవాడలోని సిఐడీ రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విజయసాయిని మినహా ఇంకా ఎవరినీ సీఐడీ అధికారులు లోపలకు అనుమతించలేదు. ఆయన వెంట వచ్చిన న్యాయవాదులను కూడా ఆపేశారు. వాటాల బదిలీ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులపై విజయసాయిని సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.కాకినాడ పోర్టు అధిపతి కేవీ రావును బెదరించి అక్రమంగా వాటాలను తీసుకున్నారనే అభియోగాలతో ఈ కేసు నమోదయింది. ఈ కేసులో ఏ1గా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, ఏ2గా విజయసాయిరెడ్డి, ఏ3గా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఇదే కేసులో విజయసాయిని ఇప్పటికే ఈడీ విచారించింది. తాజాగా ఈరోజు ఆయనను సీఐడీ విచారిస్తోంది. ఇటీవలే వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో నేటి సీఐడీ విచారణలో విజయసాయి ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
సీఐడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి
RELATED ARTICLES