Monday, June 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికులాంతర వివాహం చేసుకున్నాం.. మాకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి .. ప్రేమికుల ఆవేదన

కులాంతర వివాహం చేసుకున్నాం.. మాకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి .. ప్రేమికుల ఆవేదన

విశాలాంధ్ర- ధర్మవరం:: తాము కులాంతర వివాహం చేసుకున్నాము మాకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతూ అఖిల ,నరేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా లాయర్ త్రివేణి ఈ ప్రేమికులకు చట్టపరంగా అండగా ఉంటూ పలు విషయాలు తెలిపారు. గుత్తి మండలానికి చెందిన అఖిల 20 సంవత్సరాలు, చెన్నై కొత్తపల్లి మండలం వెంకటం పల్లి గ్రామానికి చెందిన నరేంద్ర 21 సంవత్సరాలు వీరు ఇరువురు పుట్టుకతో చెవిటి మూగతో జన్మించడం జరిగిందని తెలిపారు. వీరు ఇరువురు బుక్కరాయసముద్రంలో ఆర్డిటిలో కలిసి చదువుకున్నారు. ఇద్దరూ ఇంటర్ పూర్తి అయిన తర్వాత ఈమధ్య బెంగళూరులో వేరు వేరు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు. వీరిద్దరి చదువుకున్న ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా అఖిల బంధువులు తీసుకొని పోవడం జరిగిందని, ఆ సర్టిఫికెట్స్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నారని తెలిపారు. అదేవిధంగా మాకు ప్రభుత్వం రక్షణ కల్పించి కులాంతర వివాహం చేసుకున్న మాకు ప్రభుత్వం నుండి సహాయం అందించి అండగా ఉండాలని వారు కోరడం జరిగిందన్నారు. ఇరువురు కూడా మా బంధువులు మా పుట్టింటితో ఎటువంటి సంబంధం లేదని రాయించుకోవడం జరిగిందని తెలిపారు. తదుపరి ఈనెల 15వ తేదీ ఆదివారం కనుముక్కల వేణుగోపాల స్వామి ఆలయంలో కొంతమంది బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగిందని తెలిపారు. పెళ్లి కుమార్తె అయిన అఖిల నా బంధువులు అనివార్యమైన నిందలు మోపుతున్నారని న్యాయం చేయాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు